Sunday, October 11, 2020

అక్షరం సాక్షిగా 510

 అక్షరం సాక్షిగా 

తేది : 08-09-2020
 శీర్షిక : అమ్మతత్వం... 
సంఖ్య : 510

అక్షరం సాక్షిగా అధికారం 
పొరలు కమ్మి కార్యాలయాల్లో
కసురుకుంటున్నది... బల్ల కింద 
చేయి చాచి చేవ చచ్చి బతుకుతున్నది...

అక్షరం సాక్షిగా నల్ల ముసుగులో 
న్యాయం నలిగి పోతున్నది..
ధవళ వస్త్రాలలో దర్పంగా  
అనారోగ్యులను పట్టి పీడిస్తున్నది...

అక్షరాస్యతకు మానవత్వం 
తోడైతేనే పలుకుతుంది అమ్మతత్వం 
బడిలో నిలిచిన పంతులైనా 
బయట సాటి మనిషైనా ....

అక్షరం సాక్షిగా మానవత్వం 
జోడించుకుని మనిషిని మనిషి 
మనిషి తత్వం నింపుకుని 
ప్రతివారినీ గౌరవించాలి ...

అక్షరాస్యతంటే నాగరికత 
అభివృద్ధికి కావాలి సంకేతం 
ఆలంబనమవ్వాలి ఉత్పాదకతకు 
అదే కావాలి అసలు చిరునామా ... 

నగునూరి రాజన్న
కరినగరము. 

No comments:

Post a Comment