ఆరాధనామృతం
తేది: 27-08-2020
శీర్షిక: రామ నామామృతం
సంఖ్య: 500
పుత్ర కామేష్టీ పుణ్య ఫలంగా
శ్రీమహా విష్ణువే అవతరించె కద
ఇనవంశోత్తమ జగదోద్దారకుడై
శ్రీరామునిగా భువిపైనా ......
కరుణామయుడు కారణజన్ముడు
కులగురువైన వశిష్ఠుడి చెంత
సకల విద్యలు సముపార్జించె
అనుంగు సోదరులంతాగూడి....
రామ లక్ష్మణులు అనుసరించిరి
అమేయమైన అస్త్ర విద్యలను నేర్పి
అసురసంహారానికై ఆదేశించెనపుడు....
జగన్మాతయే అర్దాంగి కాగా
స్వయంవరాన కళ్యాణమాయె
కానలకేగె జనక మాట జవ దాటక
కారణజన్ముని కథ మొదలాయె....
మాయామోహిత సీతమ్మా
బంగరు లేడి బహుమతి కోరగ
బయటకెళ్లిరి రామ లక్ష్మణులు
మారీచుని మాయ పలుకులకు....
కండ కావరమున విర్రవీగిన
కర్కోటకుడు లంకేశ్వరుడు
కపట బిక్షువుగా ఏతెంచి
జానకి నపుడు చెరబట్టే .....
హనుమ సుగ్రీవాది వానర వీరులు
సహకరించగ వారధి బంధన గావించె
అసురలనందరి వధియించె
అమ్మ సీతమ్మను చెర విడిపించె....
యుగాలు గడిచినా జగాల నిండా
చింతలు దీర్చు శ్రీరామ నామామృతం...
ఆ ఆరాధనే నిత్యజపమై తపమై
ఆత్మ శక్తిగ అవతరించు.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment