నగునూరి రాజన్న
చిత్రకవిత
తేది : 31-08-2020
శీర్షిక: సాంకేతిక సౌరభం.
సంఖ్య : 503
మనిషి జీవిత గమనాన తరానికో
మార్పు సహజమే అయినా ...
మహమ్మారి మర్మంతో
ఉలుకు పలుకు లేకుండానే
ఉలిక్కిపడి నిలిచిన సాంకేతిక సౌరభం ...
నాలుగు గోడల మధ్య
బందీ చేసినా ..... విద్యార్థి
నడకలలోన కుదుపులు లేకుండా
బుడి బుడి అడగుల బుడతల ఒడిలో
నవ్య సాంకేతికతను సాక్షాత్కరించె....
తోటి విద్యార్థుల సోపతి
దొరకకపోయినా........
స్వీయ నియంత్రణలు నేర్పి
చిగురుటాకులను సైతం
పరిణతలతో పదిలపరుచు ...
ప్రత్యక్ష పంతులు అజమాయిషీ
లేకపోయినా ..............
అనంతమైన విజ్ఞానాలను
అరచేతి వేలి కోనల్లో ఇముడ్చుకుని
అజ్ఞాన తిమిరాలను తరిమివేయు....
మార్పులోని మర్మాన్ని నేర్పుగా
పసికట్టి ఓర్పుగా ఒడిసి పట్టి...
విజయ బావుటా ఎగరేయడమే
మన ధ్యేయంగా గమ్య తీరంగా మలుచుకోవాలి.....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment