Wednesday, November 7, 2018

పాముకు పాలు పోసినట్టు

అంశం : పాముకు పాలు పోసినట్టు 
తేది: 30-10-2018
శీర్షిక : ఓటేసినా .......


అపర సుబ్రమణ్యుడాని....
ఆశించిన  జనులంతా 
ఆరతిచ్చి పూజిస్తారు  
పాలు బోసి పుట్టలోన... 

ప్రత్యక్షమైతే మాత్రం 
పరుగుపెట్టి పడిపోతారు  
పరోక్షంగా కోర్కె తీర్చితే 
పబ్బతి పట్టి నిలబడతారు

గల్లీ నుండి ఢిల్లీదాకా
ఓట్లకోసం నాయకులంతా 
కాళ్ళ వేళ్ళ పడ్తున్నారు......ఈనాడు 
గెలిస్తే మాత్రం... అడ్రస్సే గల్లంతు  

దేవుడెప్పుడు దేవిడీలో ఉండి
అంతర్యామిగా అన్నీ జూసినట్టు..... 
నాయకుడు సైతం ఎక్కడున్నా 
ప్రజాక్షేమం సదా కోరితే ....... ఎంత బాగుండు. 

ఓటేసేదాకా ఓడమల్లప్ప
ఓటేసినాక బోడమల్లప్ప....... అన్నట్టుందీనాడు 
ప్రత్యక్షంగా ప్రతిపనీ చేయలేకపోయినా 
పరోక్షమై దన్నుగా నిలిస్తే .....ఎంత బాగుండు.

నగునూరి రాజన్న

No comments:

Post a Comment