దర్పణం సాహిత్య వేదిక
అంశం : పరీక్ష వాయిదా
తేది : 20-07-2024
శీర్షిక : సమాచార సమిధలు
ఆశల పందిరి వేయడంలో
నిష్ణాతులు మన నాయకులు ...
తాయిలాలు చూపిస్తూ తమ
పనులు చక్కపెట్టుకునే ఘనాపాఠీలు ...
కులాల వారీగా మతాల వారీగా
కుర్రాళ్ళుగా ఆడాళ్ళుగా ముసలోళ్ లుగా
అంగవైకల్యులుగా చదువుకున్నోళ్లు గా
చదువులేనివారిగా .... ఎలా వీలయితే
అలా విభజించడమే రాజకీయం ...
ఈ మధ్యన పోటీ పరీక్షల పిల్లలకైతే
చుక్కలు చూపిస్తున్నారు.
ఒక్కటంటే ఒక్క నిమిషానికే ....
వేలు లక్షలు జీతాలవారికిలేనిది ....
పాలకపక్షం అన్నీ సవ్యంగా చేస్తే
ఎలా? అంటూ గోతులు తీసే పనిలో
నిమగ్నమయ్యే ప్రతిపక్షాలు ....
పాలకపక్షమే పరీక్షలంటూ తెలిపి
వారి మనుషులే కోర్టుకెళ్లి స్టేలు ...
ప్రజలు వెర్రి పప్పులనే భావన
నాయకులది ...ఇంకా కొంగ జపాలు
కోడిపుంజు నాటకాలు ... సమాచార
వేగం సమిధలు పేరిస్తే ....కాలి బూడిదై
పోవాల్సిందే .... గాలి వానకు ఎప్పుడో
ఒకప్పుడు కొట్టుకు పోవడం ఖాయం ....
స్వార్థం సర్పంలా బుసలు
కొడుతుంటే... కొందరి పనికి అందరు
బలి పశువులై పోతున్నారు ... నాలుగు
రకాల పేపర్లతోనో ఇంకేదైనా కొత్తరకం
నివారణాలతోనో ఇలాంటి మూర్ఖులకు
చెక్ పెట్టాల్సిందే.....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment