Tuesday, July 31, 2018

ప్రాణం ఖరీదు / నేటి వైద్యం


మనిషన్నవాడు మాయమౌతున్నాడు 
మానవత్వమన్నది మచ్చుకైనా లేదు 
అందుకు వైద్య వృత్తేమ్ అతీతం కాదు 
వైద్య విధానమేదైనా వాణిజ్యమయమే.  

కాలుష్య కాసారాల పుణ్యమాని 
కంటి మీద కునుకు పడనీయని 
కొత్త కొత్త అనారోగ్యాలు కోడై కూస్తున్నవి 
డబ్బెనక మనిషి, మనిషెనక జబ్బు పరుగెడుతున్నయి.  

న్యాయ శాస్త్ర మార్పుల పుణ్యమా అని  
నాడి చూసే విధానమే కరువైంది 
అన్ని రకాల అనారోగ్యాలకు 
అనేక రకాల పరీక్షలంటున్నారు 

పది రూపాయల పాటి చెయ్యని సెలైన్, 
రెండు రూపాయల విలువ చెయ్యని
రక్త పరీక్షలకు సైతం వందల్లో వసూలు  
రోగి పుండ్లకు కార్పొరేట్లు కాకులై  పొడుస్తున్నరు. 

ప్రభుత్వాలు పట్టించుకోక
పలాయన మంత్రం పఠిస్తుంటే  
ప్రైవేట్ వైద్యశాలలేమో 
పెచ్చరిల్లి దోచుకుంటున్నయి 

చట్టు ఉన్నోడికి చుట్టమే  వైద్యం 
చట్టు లేనోడికి ప్రభుత్వమే ధైర్యం 
మందులని, మాకులని మధ్యోనికి నరకం 
మల్ల గుళ్లాలు చేస్తున్నారు ఒళ్ళు - జేబులు 

కనికరం కలిగి వైద్య వృత్తి నిపుణులు 
కలుషితమైన ఆలోచనలు మాని 
కనువిప్పు కలిగి బయటపడినప్పుడే 
కాదా జన సామాన్యులకు పండగ .  

No comments:

Post a Comment