అంశం: విధ్వంసం
శీర్షిక : సర్వ మానవ కళ్యాణం
మంచి చెడులకు మానవ మేధస్సే కేంద్రం
స్వార్థం సారీ చేస్తుంటే
తాను మాత్రమే అన్న రాక్షత్వం, అహం
తనను కూడా మింగేస్తుందని అర్ధం కానివ్వదు
పాలకులు,అధికారులు తామే సర్వస్వం అనుకుని
పరిధులు దాటి ప్రలోభాలకు లోనవుతూ
వాగులు, వంకల్లో ఇసుక మాయం
వనాలు, గుట్టలు గుటుక్కుమనిపిస్తున్నరు.
వన చరాలను , జల చరాలను
చెర బట్టి పీడిస్తుంటే....
ఆవాసాలు లేక అరణ్యాలు వదిలి
మన నివాసాలపై స్వైర విహారం చేస్తున్నాయి.
భూగర్భ నీరు అడుగంటి
అకాల వర్షాలతో పాడి పంటలు కకావికలం
అన్నదాతలు అతలాకుతలమౌతుంటే
విశ్వ వినాశనానికి విత్తనాలు మనమే వేసుకుంటున్నాము.
ఇంకో పక్క అహం నిండిన దేశాధినేతలు
నా వద్దంటే, నా వద్దంటూ ... అణుబాంబులు
ప్రపంచ విధ్వంసానికి పథకాలు రచిస్తుంటే
ప్రతీవాడూ ప్రకంపితుడే.
ఇప్పటి కైనా మించింది లేదు
ఇరుగు పొరుగు చల్లగుండాలనే
ఇంగితాన్ని గుర్తెరిగితే
ఇగురిస్తాయి ఆశలు
సర్వ మానవ కల్యాణానికి.
No comments:
Post a Comment