Friday, July 27, 2018

పత్రికలు

పత్రికలు 

ప్రపంచాన పదహారవ శతాబ్దాన 
పయనం  వ్రాత ప్రతులు గా.....  
పలు విధాలా ఫరిడవిల్లిన  పత్రిక
పంచుతున్నది నేడు అంతర్జాలాన. 

చాతుర్వర్ణాల వ్యవస్థలు అంతరించి 
చతుర్వ్యవస్థల ప్రజా పాలనలో 
రాజ్యాంగ చతుర్థ స్థానం భారతాన .... 
బెంగాల్ నుండి పయనించి మద్రాస్,
బొంబాయిల మీదుగా ప్రసరించె దేశమంతా . 

స్వాతంత్య్ర పోరాట సమయాన 
సరంగు పాత్ర పోషించి సంకెళ్ళను ఎడ బాపె.  
ఉద్యమాల ఉనికిలో  ప్రజా  గొంతుకై  పరితపించి 
ఉవ్వెత్తున నిలిపి విజయ గీతికలందించె.  

ఆడ,మగ, పిల్లా, పాప, యువత 
అందరిని అలరించ అన్ని భాషల్లో 
దిన,వార ,పక్ష,మాస పత్రికలూ
వెల్లి విరసి వర్దిల్లె  భువి నిండా  .  

సమున్నత స్థానం పొందిన పత్రికలు  
సందట్లో సడేమియా లాగ 
స్వార్థం పెరిగిన నాయకుల చేతులలో నేడు   
కీలుబొమ్మలై అచేతనానినికి అంచున ఉన్నవి. 
ప్రజల మనోభావాలకు ప్రతి రూపమై  
పరిశోధనాత్మకతతో  ప్రజాయుధముగా 
మలుచుకుని  నిలవాల్సిన  పత్రికా రంగం  
పచ్చ పాత్రికేయతతో పతనమౌతున్నది ఈనాడు  

హద్దులెఱిఁగి మసిలితే ముద్దు గొలుపు
అదుపాజ్ఞలు దాటితే అభాసుపాలు.  

No comments:

Post a Comment