అంశము: గేయం
26-09-2020
శీర్షిక: బాలు గారి స్మృతిలో..
సంఖ్య: 526
ఏ పాట పాడను ఎదమీటిన రాగము
సరిగమలు తెలియని మామూలు మనిషిని
నేను మామూలు మనిషిని //2//
గమకాల గడసరికి
సంగతుల సౌగంధికి
పరిమళాల భూషణునికి
సుస్వరాల మాంత్రికునికి
సుమధురాల గాయకునికి // ఏ //
పలు భాషల పాటలను
రసములన్ని రంగరించి
అలవోకగ ఆలపించి
మాధుర్యం పంచిన మహనీయుడికి
గాన గంధర్వుడికి // ఏ //
పరితపించి చేశావు
పాడుతా తీయగా
పదనిసల పాపాయిల
పదులల్లో వెదికి వెదికి
పట్టి వెలికి తీసావు // ఏ //.
స్వరాభిషేకములతో
సంపన్నం సుసంపన్నం
సన్నుతించి పాడావు
సరస్వతీ దేవీకి రాగం
స్వర నీరాజనం .... // ఏ//
వేన వేల పాటలు
వెల లేని సంకీర్తనలు
పదిలమైన నందులు
పద్మశ్రీ పద్మభూషణలు
పటుతరముగ డాక్టరేట్లు
పల్లవించిన పురస్కారాలకు
//ఏ//
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment