Wednesday, June 20, 2018

మింటికేగెను మిమిక్రీ రారాజు

మింటికేగెను  మిమిక్రీ రారాజు 

మట్టెవాడ ఓరుగల్లు బిడ్డ
మన నేరెళ్ల వేణుమాధవుడు
పదహారవ ఏటనే పయనించాడు
పసిమి మిమిక్రితో వాడ వాడాలా
దేశ,విదేశ  విశ్వవేదికలయందు. 

ఎందరెందరినో ఏకలవ్యులను చేసాడు
మరెందరికో మార్గ దర్శకుడయ్యాడు
మారుమోగించాడు ధ్వన్యనుకరుణలతో 
పసిపల్లలు సైతం లాలన పొంది పాలు తాగేవారు
వేణుమాధవుని స్వరమధురిమలతో .

పలు భాషా చలన చిత్రాలలో సైతం
పదిలమై నిలిచి  అనుకరించబడి
పదికాలాలకు మనుగడైనిలిచినది.
పసందు కేరింతలకు చిరునామా అయ్యింది.
పద్మపురస్కారం డాక్టరేట్లను కైవసం చేసుకున్నాడు

వేల వేణువులను కదిలించాడు
వేణు మాధవుడుగా వినుతికెక్కాడు
వైవిద్య స్వరార్చన చేసిన సాందీపుడు
వారి విద్యకు పాట్యంశాలను పదిలపరిచి
వర్ధిల్లినాడు ప్రజా హృదయాన మిమిక్రీ పితామహుడై

No comments:

Post a Comment