పరాయి పాలన
తేది : 14-08-2024
శీర్షిక : బ్రతుకు ... బ్రతుకనీయి ...
పంచ తంత్రములోని మూడు
చేపల కథలా ... బుద్ది నేర్వక
పోతే... సద్ది ముల్లె గల్లంతయినట్టు
అనుభవాలనుండి పాఠాలను
నేర్చుకోవాల్సిందే....
ఆనాటి చిన్న చిన్న అనైక్యతలను
శత్రువులు తమకు అనుకూలంగా
మలుచుకుని... విభజించి పాలించు
అంటూ అదే తంతును కొనసాగిస్తున్నారు ...
నాగరికత అంటూ కట్టు కథలెన్నో
చెప్పుకుంటున్నాము... అయినా
వన్యమృగాలలా ఈనాటికి పొరుగును
హింసించడమే పనిగా పెట్టుకున్నాము.
మనం పాటించిన అహింస గొప్పదని
వేనోళ్ళ పొగడ్తలే ... కానీ మనది వదులుకోం
మాదికానిది మాకొద్దు అని ఎంత మొత్తుకున్నా
పట్టించుకున్న దాఖలాలు లేవు ....
కలుషితాల కుప్ప మనిషి ప్రతిక్షణం
కన్నేసి పక్కొనికి నిద్రలేకుండా
చేసే దౌర్భాగ్యపు రాజ నీతిని గొప్పగా
చెప్పుకునే రోజులున్నంతవరకు
పోరు బాటలే శరణ్యం .....
కడుపులో లేనిది కావులించుకుంటే
ప్రేమలు పొంగుతాయా .... కల్మషాలను
కడుక్కుని బ్రతుకు ... బ్రతుకనీయి అనే
సూత్రమైతేనే ఎల్ల విశ్వం క్షేమం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment