దుమారం
తేది : 10-11-2020
సవ్వడి సంఖ్య : 38
శీర్షిక : మలి ఉద్యమం...
వందలేండ్ల వలస పాలన
ఆరు శతాబ్దాల ఆక్రందన
కల్మషమెరుగని తెలంగాణ
కబుర్లు చెప్పి కలుపుకున్నారు ....
వివాద రహితుడైన పి విని
సైతం విచలితున్ని చేశారు
స్వపక్షమే ప్రతిపక్షంగా మారి
సర్వ మంగళం పాడారు......
అక్షరాస్యత అంతంత
మాత్రమైతే ఏంటి ?
ఎదుటివారిని గౌరవించడంలో
ఎదురులేదు తెలంగాణ ప్రజలకు...
అరువదుల కాలములోనే
బ్రహ్మాండమైన ఉద్యమం
రూపుదిద్దుకున్నా ....
మరుగున పడింది నాయకుల
విరుగుడు మంత్రములతో ....
నాటి నాయకుల ఆలోచనలు
ఆచరణలు హోమంలో
ఆజ్యం పోస్తే కొంతమంది
ఏకంగా కంట్లో కారం కొట్టారు...
తోలి ఉద్యమం తొలిగిపోయినా
మలి ఉద్యమానికి అంకురమై
సర్వ జనుల సమ్మెతో సంధించబడి
ధూమ్ ధాములతో దుమారమై ...
భాషను యాసను బతికించడం
నీళ్ళు నిధులు నియామకాలంటూ
ప్రత్యేక రాష్ట్ర కోరిక... పరాకాష్టకు
ప్రతివారు దిగి వచ్చి పట్టంకట్టారు....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment