అంశం: తీరని దాహం
తేది: 03-11-2020
శీర్షిక: ప్రజలకు అసహ్యమేసినా ....
సంఖ్య : 554
మనుషులంతా వచ్చింది
మర్కటములనుండే అయినా
జిహ్వకో రుచి పుర్రెకో గుణంలా
కొంతమందికే పాలనంటే పాణం ...
ప్రజా పాలనలకే నిర్వచనం
పరంధాముడైన శ్రీరాముని
త్రేతాయుగం నాటి మాట
అయినా అంటనీయని చిత్తశుద్దే....
ప్రజా సేవకే అంకితమంటూ
ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన
ఉత్తమ విద్యార్థుల్లా ఫోజుకొట్టి
చిలుక పలుకులు పలికే
ఓడమల్లప్పల నాయకులకు
ఒడ్డెక్కినాక అంతా బోడమల్లప్పలే ...
స్వార్థ సాగరంలో మునకలేస్తూ
కుంభకోణాలలో తేలియాడుతూ
చూసే ప్రజలకు అసహ్యమేసినా
మేసే నాయకులకు తీరని దాహమే....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment