అంశం: స్వరాలు తొడిగిన కవిత
తేది: 05-11-2020
శీర్షిక: సూదంటు రాయే కదా ...
సంఖ్య : 556
అక్షరాలవే అయినా వైవిధ్య
పదబంధాల ప్రయత్నాలు..
అంశమేదయినా అలంకార
యుక్తమయిన శోభితాలు..
ప్రయత్నించే ప్రతీసారి పాఠకులను
కదిలించే పరిమళాలు ...
తరాల అనుభవాలను
నడుస్తున్న పరిస్థితులను
మదింపు వేసి మేధోమదనం కావించి
రేపటి సువర్ణ భరితానికి
సృశించి సూక్ష్మంగా బోధించి
అనుసంధానం చేసే ప్రయత్నమే...
చాంతాడంత చరిత్రలను
ముంజేతి కంకణంలా ముందుంచి
సుందరంగా తీర్చి దిద్దగనే
ముగ్దమైన కవితలా ఆకట్టుకుంటే...
అందమైన పల్లవి..
అదిరిపోయే చరణాలు..
ఆకట్టుకునే బాణీలు...
సరిగమల తాండవమైతే
సంగీతమయమైన సంపద
వేణుమాధవుని మురళీరవమే....
మధువొలికే కవితా కుసుమం
ఇక సూదంటు రాయే కదా !
నగునూరి రాజన్న
No comments:
Post a Comment