నగునూరి రాజన్న
అంశం: చినుకు మాట్లాడితే
తేదీ: 22-10 -2019
శీర్షిక - అవని చిత్తడి....
సంఖ్య- 308
చినుకు సోకి చిందేయగానే
నెర్రెలూనిన నేలమ్మ నింగికెగురు
ఆహ్లాద వర్షాలు ఆవరించంగా
కఠిన గ్రీష్మాలు కనుమరుగు మిత్రమా ....
చినుకు మాట్లాడితే అవని చిత్తడే
చిగురు తొడుగు చెట్టు చేమ నిక్కము
ధరణి పులకరించి తండ్లాటలు బాపు
బతుకు దొరుకు చేవ కలుగు ప్రాణకోటికి..
అరకదున్నే రైతన్నలకు అతలాకుతలమే
సమవృష్టి అయితేనే సమ సమాజం
సక్కనై సాగుతుంది బతుకుదెరువు అందరికి...
రైతన్న జీవితాన రాచబాట
చేతివృత్తులకు చేయూత పనిపాట
పిల్ల పాపలకేమో కంటి వెలుగు
ప్రాణికోటికి పంచు దరహాస స్వప్నాలు......
నీటి చక్రం కరుణిస్తేనే పండంటి జీవితం
పర్యావరణం పరిరక్షిస్తేనే అందుకు సాకారం
ప్రతివారు కదిలితేనే ఏదైనా సాధ్యం
మనకెందుకులే అనుకుంటే విస్ఫోటనమే......
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment