Friday, November 22, 2019

విదుషీమణి

నగునూరి రాజన్న
అంశం -  విదుషీమణి 
తేదీ 19-11-2019
శీర్షిక - మానవతకు మచ్చుతునక ... 
సంఖ్య - 316

అల్బేనియాలో పుట్టిన ఆడపడుచు 
ఆదరించి నిలిచె అనాథలను వృద్ధులను 
ఆత్మీయతలు చాటి ఆదరించె కదా 
అతిక్లిష్టపు అనారోగ్యులను సైతం ...... 

ఒక్క అడుగుతో మొదలైన ప్రస్తానం 
వేల అడుగుల సావాసమై నిలిచె .... 
ఒంటరి పోరాట విజయ విహారం 
ఒనగూడె  మిషనరీస్ అఫ్ ఛారిటీ ద్వారా ..... 

అంటరాని అనారోగ్యాల బారిన పడిన 
అనేక దేశాల ఆకలి గొన్న అల్పాదాయులకు 
ఆమె కదా... విశ్వశాంతి మాతై వెలుగొందే 
విరిసిన మానవత్వానికి విశిష్ట మార్గదర్శిగా. 

పాల పొంగుల పండు వెన్నెలలను 
పంచే శశి సుందర సుదూర దృశ్య మాలికలా 
పల్లవించిన విదుషీమణి సైతం 
మూటగట్టుకునె కొన్ని నీలి నీడలు...... 

ఏమైతేనేం..... 
మానవత్వం వెల్లి విరిసింది 
దైవత్వం సంతరించుకున్నది 
మానవతకు మచ్చుతునక ...   
అన్నీ ఉన్న ఆకు అణిగి మనిగి .. అన్నట్టు 
ఎందరో మహానుభావులు ..... 
అందరికి వందనాలు 


నగునూరి రాజన్న
కరీంనగర్ 

No comments:

Post a Comment