నగునూరి రాజన్న
అంశం - మల్లె పందిరి
తేదీ - 23-09-2019
శీర్షిక - మల్లె సుగంధం
సంఖ్య - 294
అందమైన ఇంద్రధనస్సుకు
సప్తవర్ణం నిండు శోభయినా
అందుకు మూలం
మల్లె పొదువు కున్న శ్వేతమే కదా !
మండుటెండల గ్రీష్మమేతెంచి
కాలం కనికరించకపోయినా
మలయ మారుతమై
మల్లె పందిరి సేద దీర్చి కరుణించు కదా !
మనసు దోచుకునే సువాసనల
మల్లె పందిరి తావులు కూడా
అల్లుకునే తీగ మెలికలు
ఆత్మీయతలకు బాట చూపు!
పూవులన్నీ కలిసి ఉత్సవాల
ప్రాంగణ శోభను ఫరిఢవింప జేసినా
మూల విరాట్టును అలంకరింపజేయు
పుణ్య మూర్తుల మల్లె సుగంధాల ప్రాశస్త్యమే వేరు!
అరివీర భయంకర యుద్ధ నీతిన సైతం
మల్లె పోలిన శ్వేత వర్ణ ధ్వజంతో
మానవత వికసించి ఫరిఢవిల్లగా
శాంతి కాముకత దయమయిగా దారి చూపు!
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment