Monday, September 2, 2019

మట్టి వినాయకుడు

నగునూరి రాజన్న 
అంశం - మట్టి వినాయకుడు 
తేదీ - 02-09-2019
శీర్షిక - పంచ భూతాల పరిమళం .. 
సంఖ్య- 277

అమ్మానాన్నలే ఆది పూజ్యులన్న వితరణశీలి
అమ్మ చెక్కిన శిల్పంగా  ఆది పూజ్యుడయ్యాడు
మనందరికీ గణనాయకుడయ్యాడు ....
విధి నిర్వహణలో అసువులు బాసి
వింతగ కరి ముఖము నలంకరింప జేసుకుని
విగ్నములను బాపే వినాయకుడయ్యాడు ....
విజ్ఞానాలకు  నిలయమయ్యాడు.....

వేదాలు వెన్నంటి ప్రోత్సహించినా
శాస్త్రాలు విడమరిచి వివరించినా
ఆచారాలు అవపోశన పట్టినా
సాంప్రదాయాలు సుద్దులెన్ని చెప్పినా...
సంఘ కల్యాణానికే  సందేహం లేదు
మానవాళి ఆరోగ్యానికే పెద్దపీట......

రంగులెన్ని అద్దినా హంగులెన్ని  చేసినా
పర్యావరణ కలుషితాలను ఉసిగొలిపి
మానసిక ప్రశాంతతలను కొల్లగొట్టి
మానవాళి మనుగడకే ప్రశ్నార్ధకమయ్యే
ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ లు వద్దే వద్దు .....
పంచభూతాల పరిమళాలు అద్దుకున్న
మానవులకు...  కొత్త నీరు చేరిన సరోవరాన
మట్టి వినాయక బొమ్మలే ముద్దు ...
ఔషధగుణాల పత్రములే హద్దు ....

నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం USA)


No comments:

Post a Comment