Thursday, September 12, 2019

నూరేళ్ళ సింగరేణి

నగునూరి రాజన్న
అంశం - నూరేళ్ళ సింగరేణి

నూరేళ్ళ సింగరేణి  తెలుగింటి పూబోణి
వరహాల మణిదీపం తల్లిలా ఆదరించె

తెల్ల దొరల నాటి నుండి వారధిలా నిలిచింది
తెలుగు వారినాదరించి వారసుల నాదుకుంది

ఖమ్మంలో మొదలెట్టి కరీంనగర్ చేరుకుంది
ఆదిలాబాద్ ఆవరించి ఓరుగల్లు నల్లుకుంది

మెకానికల్ పద్దతిగా మొదలైన ఉత్పత్తి
నాటి నుండి నేటి వరకు నానా రకాల మార్పు చెందె

మిషన్ మైనింగ్ డిపిల్లరింగ్ ఓపెన్ కాస్ట్ విధానాలతో
ఉత్పత్తిని పెంచుతూ అవసరాలను తీర్చుతుంది

జెన్ కో కే  వన్నె తెచ్చిన  నాటి ఏ  బి పవర్ హౌస్ లకు
దన్నుగ నిలిచి పారిశ్రామిక ప్రాంతానికి  పరిచయం చేసింది

దేశంలోనే మొదటిదైన బొగ్గునుండి యూరియా
రామగుండం ఎఫ్ సి ఐ  కి మూలమయ్యింది

కేశోరాం సిమెంట్  బిర్లా పరిశ్రమకు
అంతర్గాము లోన  ఆదరువై నిలిచింది

దక్షిణ భారతాన నవరత్నపు పరిశ్రమగా
ఎన్ టి పి సి  ఆవిర్భావానికి పునాది వేసింది

రకరకాల పరిశ్రమలకు రాచబాట వేసింది
రామగుండాన్నే సింగరేణిలో రారాజుగ నిలిపింది.

(స్నేహ సాహితీ వారి చెమ్మస్ పుస్తకం 2000 సం లో వ్రాసింది )


No comments:

Post a Comment