నగునూరి రాజన్న
అంశం - సన్మానం
తేదీ - 03-09-2019
శీర్షిక -మనసున కలిగే ఆహ్లాదం
సంఖ్య - 278
మంచి పనికి మనసున కలిగే ఆహ్లాదం
పది మందికి ఉపయోగపడిదైతే ..
విజ్ఞులంతా కలిసి విశిష్టతను
కొనియాడి గుర్తింపు నిచ్చేదే ....
చావు పుటుకలు మాత్రమే నీవి
బ్రతుకంతా దేశానిదన్నాడు ఓ మహాకవి...
చదువైనా కొలువైనా శ్రమైనా
విలువ పెంచడమే ద్యేయం......
పరుల మేలే గాని పక్షపాతమెరుగని
పంచభూతములన్నీ సాక్ష్యములే...
ప్రజల సౌకర్యమే ప్రాణప్రదమన్న
పల్లె వృత్తులన్నీ పరోపకారమే..
తెలియంది నిబద్దతతో నేర్చుకోని
తెలిసింది నియమంతో చేసి
ప్రయత్నించి ఫలితాలు చేరుకోన్న
పరిణతితో శిఖరాలు అధిరోహించిన వారికి ...
అలాంటి మహానుభావులు దొరికితే
అప్పుడప్పుడు అందరు చేరి
సన్నుతించి నలుగురు చేయు
మెచ్చు ముచ్చట్లే కద ! సన్మానం ...
నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)
No comments:
Post a Comment