Thursday, September 5, 2019

ఉపాధ్యాయులు నాడు - నేడు 2

నగునూరి రాజన్న
ఉపాధ్యాయులు నాడు - నేడు
తేదీ - 05-09-2019
శీర్షిక - దేశ వికాసానికి దిశ
సంఖ్య - 280

నాడైన నేడైన గురుర్దేవోభవ !
సంప్రదాయంగా మూడవదే
అమ్మలాంటి  ప్రేమలకు
నాన్నలాంటి మందలింపులకు చిరునామా !

బతకలేక బడిపంతులని ఎద్దేవా చేసినా ....
జీవితాన్ని అమృతంతో  రంగరించి
ఆనందంగా ప్రేమతో అందించేవారు
పిల్లలంటే ప్రాణంగా పదిలపరిచేవారు... నాడు

పల్లెనయినా పట్నానైనా ఎక్కడైనా
మారు మూల పల్లెల్లో ప్రజలతో  మమేకమై
పాఠాలు నేర్పేవారు... నల్లబల్లకు
అలంకరించుకున్న సుద్దముక్క సాక్షిగా....

కారణమేదైనా
పల్లెల్లో ఇమడలేక పట్న వాసాలు చేసి
పిల్లలతో కలువలేక ఫలితాలు రాబట్టలేక
పగలంతా రాక పోక... పై అధికారుల మొట్టికాయలు...
ప్రైవేటుల పటాటోపంతో  నలిగారు ....  మధ్యలో...

ఇప్పుడిప్పుడు ...
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాల దన్నుతో
ఇంగ్లీష్ చదువులకు సైతం సై అంటూ ....
నవ్య సాంకేతికత సొబగులద్దుకుని
ఏరి ఏరి పిల్లలంటూ గాలింపులు చేసి
కోరి కోరి తల్లి తండ్రుల సమ్మతికై ఆరాటం...

పగలంతా తల్లి తండ్రులనొదిలిన పిల్ల
విద్యార్థులను మరో సిద్ధార్థునిగా చేయ
మట్టి నుండి మాణిక్యాలను తయారు చేస్తూ
దేశ వికాసానికి దిశా నిర్దేశం చేస్తున్నారు.....

నగునూరి రాజన్న
కరీంనగర్ (USA)

No comments:

Post a Comment