హృదయ లోగిలి
తేదీ - 09 -01 -2020
మానవత్వం మరుస్తున్న వేల.....
సంఖ్య - 344
పల్లె పట్టున జీవించిననాడు
ప్రశాంత వాతావరణంలా
పదిలమై కల్మషము లేని
పవనమై పదిమందితో కల్సి పోయింది....
ఒకటొకటిగా పట్టణాలు
పెరుగుతుంటే ఒంటిరి పోరాటం
మొదలై మెల్ల మెల్లగా పక్కకు జరిగి
బిక్కు బిక్కు మనే బ్రతుక్కి అలవాటు పడింది....
పారిశ్రామికీకరణతో పరుగు
లంగిచుకున్న ఉరుకుల పరుగుల
జీవితం ఫక్తు ఒంటరైపోయి
పక్కవారిని కూడా పట్టించుకోవడం మానేసింది.....
సాకేతికతల సంబరంలో
మునిగిన హృదయ లోగిళ్ళు
మాటలు కరువై..... వ్యాకోచ సహజత్వాన్ని
మరిచి కుంచించుకు పోతున్నయ్ .....
ఇవి చాలవన్నట్లు ఇంకా వ్యాపిస్తున్న
కాలుష్య కోరలతో కటిక పాషాణంగా మారి
సాటి మనిషికి మాటసాయాలు కూడా
మరిచి తెర వెనక బ్రతుకులీడుస్తున్నది......
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment