Sunday, December 15, 2019

వృత్తి ధర్మాలు

నగునూరి రాజన్న 
వృత్తి ధర్మాలు
తేది -14-12-2019
శీర్షిక - మోక్ష సూక్ష్మాలు 
సంఖ్య - 333

పాలకులు కూడా ప్రజలేనంటూ 
ప్రజలే అన్నింటా ప్రధానమంటూ 
పాలనలు పకడ్బందీగా పాటించ
పరంధాముడే మానవుడయ్యాడు ........ 

కర్మ సిద్ధాంతపు మర్మం తెలుప 
ధర్మ సూక్ష్మాన్ని దార్శనికత జేయ 
జన్మ మార్చుకుని జగతిన చేరే... కదా 
జగన్మోహనుడే యుగపురుషుడై ఈ జగాన.... గీత బోధించ 

అందరు బాగుండాలి అందులో నేనుండాలి
ఒకప్పటి మాట..... 
ఎవ్వరేమైనా.... నేను మాత్రమే బాగుండాలి .... 
ఈనాటి మాట...... 
చెప్పుకుంటూ పోతే.... చాంతాడంత ..... 

రంగులు మార్చే రాజకీయాలు
చేతులు చాచే అధికారగణాలు
దళారులే దండి దళపతులుగా   
బొక్కసాన్ని దక్కించుకుంటుంటే.... 

కల్తీల కండలు కాలరెగరేసుకుంటుంటే  
కాలుష్యాలు విర్రవీగి కబాడి ఆడేస్తుంటే
విషనాగులై  వీర విహారం చేస్తుంటే
అనారోగ్యాల కార్చిచ్చులు  దావానలమై వ్యాపిస్తుంటే 
వైద్యం బస్తీమే సవాలంటూ కుస్తీలకు దిగుతుంటే... 
ప్రజారోగ్యాలన్నీ అప్పనంగా కుప్ప కూలుతూంటే ...... 
విద్య వినయ విధేయతల దారి మార్చుకుంటుంటే... 
ప్రజాసంక్షేమం పతనదారుల పయనిస్తుంటే......

కుల మతాల కుళ్ళు మనకొద్దు .... గానీ ... 
వృత్తి ధర్మాల ఊసులు మాట్లాడకుండా ఉండలేకున్నా.... . 
కవాతు చేయడానికి ధైర్యం కూడగట్టుకుంటున్నా.... 
వాణిజ్యనీతి వరస మారిపోయిందని .... 

అడ్డగోలు దొడ్డి దారుల రాబందులు కాలేదు 
అత్యాశల కరటక దమనకులుగా ఎదుగలేదు... ఆనాడు  
వస్తు నాణ్యతలు వసివాడని సతతహరితం ..... 
వణిక్ ల  చెంత ఉన్నంతకాలం..... 
వ్యాపారం వాణిజ్యం కూడా నీతి నియమాలతో సాగింది
గుప్తుల కాలం స్వర్ణ యుగంగా కీర్తించబడింది.....
అందుకే వృత్తి ధర్మాలు సైతం మోక్ష్మ సూక్ష్మాలు....... 

నగునూరి రాజన్న 
కరీంనగర్

No comments:

Post a Comment