లోకాభిరామాయణం
తేదీ 02-12-2019
శీర్షిక -విజ్ఞానుల మౌనం వినాశనానికి నాంది....
సంఖ్య - 326
ఊరికే ఉంటె ఊరా పేరా ?
ఊసుపోక కబుర్లు వల్లించినా
ఉడికించే ముచ్చట కావాలి
ఊపు తెచ్చే విషయమై ఉండాలి....
అసలు పనికి ఆలస్యమైనప్పుడు
సమయ దాటింపునకు సరదాగా
ఎదుటివారు ఎవరైనా సరే అంటూ
సన్నుతించుకునే సాగతీతలు .....
లోకాభిరామాయణమైనా సరే
లోకోద్ధరణకు ఉద్దేషించాలంటే
పన్నులు కట్టి పక్కకు తప్పుకోవడం కాదు....
పక్కవారి క్షేమం కూడా కోరాలి.....
స్వార్థాలను సంస్కరించుకుని
సంఘ క్షేమం కాంక్షించే ఫలవృక్షం కావాలి.....
విద్యనమ్ముకుంటూ విజయం
సాధించామనే బావిలో కప్ప కాకూడదు...
మత్తు మందుల విషకోరల్లో
మనమంతా సమాధి కావాల్సిందేనా ?
అందరు బాగుండాలి
అందులో నేనుండాలి అనే విశాల దృష్టి కావాలి.
అప్పుడే దశ మారుతుంది
"దిశ" లాంటి దిక్కులేని చావులు కొంతైనా తగ్గుతాయి....
విజ్ఞానుల మౌనం కొనసాగితే
వినాశనానికి నాంది...... సంకేతం....
నగునూరి రాజన్న
కరీంనగర్
No comments:
Post a Comment