నగునూరి రాజన్న
అంశం - దారి తప్పిన గమ్యం
తేదీ- 09-05-2019
శీర్షిక - పాలకుల పని తీరు ...
సంఖ్య - 181
నాగరికత పేరుతో
నడక నేర్చుకున్న
నవీన మానవునికి
ప్రతి అడుగున
ప్రకృతి గొడుగై నిలిచింది.
అభివృద్ధి పేరుతో
అడుగేస్తున్న
అలసత్వపు మానవుడు మాత్రం
ప్రకృతిని పట్టించుకోక
ఫలితం ఆశిస్తున్నాడు.
చాప కింద నీరులా
పచ్చని అరణ్యాలపై
పడగ విప్పిన పాద ముద్రలు
పగ బట్టి అతి నీల లోహిత
కిరణ నిరోధినిని ఛేదించే
వరకు అర్రులు చాస్తే.....
వాగులు, వంకలు,
వాలు పర్వతాలు
వాయసాల పాలవుతుంటే....
వానల చిరునామాలు
వాటంగా గల్లంతవుతూంటే....
వారెవ్వా అనుకున్న మానవ జీవితం
వామ్మో... అనే స్థాయికి చేరుకుంటుంటే....
ప్రజల నిరక్షరాస్యత,అవగాహన లేమి
ప్రజానాయకుల నిర్లజ్జ , నిస్సిగ్గు
పాలనాధికార్ల అలసత్వం, మంద బుద్ధి
పర్యావరణ పతనానికి రాచమార్గాలౌతుండే ....
పచ్చ పన్ను పేరుతో ప్రజల స్వేదం
పదుల వత్సరాల వసూళ్లు
ఎక్కడేసిన గొంగళి అక్కడే మాయం .....
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment