Monday, May 13, 2019

యుగ ధర్మం

అంశం - యుగ ధర్మం 
తేదీ  - 30-04-2019
శీర్షిక  - యుగాన్ని బట్టి ధర్మం 
సంఖ్య - 172 

శిశిరంలో ఆకు రాల్చి 
వసంతంలో చిగురించినట్టు 
కాల గమనంలో మారే కొలమానం 
కృత,త్రేతా,ద్వాపర మరియు కలి.... 

ప్రకృతే పరవశించి పండించె 
ప్రజావసరపు  తిను బండారాలు... 
దుర్భినికైనా కానరాని దుష్టాంతాలు 
దునుమాడుటకు దూరం జనమంతా .... 
కాదా ఇక స్వర్ణ జీవనం స్వర్గం  ..... కృతం 

ధర్మం కుంచించి మూడు పాదాలే అయినా  
పరంధాముడే  పరుశరాముడై , రాముడై 
ప్రజా పాలనలకు పరమార్ధత చేకూర్చె 
యుగాలు మారినా యువత నేర్చుకోవాల్సింది --త్రేత 

వేదాలు నాలుగయి వెలుగొందు విశ్వాన 
వేదనలు అంతర్గతంగా వేటాడి వెంబడించు 
వెన్నదొంగయిన పురుషోత్తముడే  
వెతలుడిగే గీత బోధించె మానవ కళ్యాణానికై ...ద్వాపర 

దాన ధర్మాలు ఒకవంతయి అలరించ 
దానవులై నర్తించు మానవ ముష్కరులు 
దండిగా గాండ్రించు కలుషితాలన్నింట 
దగా మోసములే కలి చిరునామాలు.... మానవా !

ఖర్మలననుసరించే...  స్వార్థం  
పరమార్థం,పురుషార్థం.....  
ధర్మాలనునుసరించే ఖర్మఫలం  
యుగాలననుసరించి ధర్మం....  

నగునూరి రాజన్న 
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )

No comments:

Post a Comment