అంశం - పౌరాణిక ప్రాభవం
తేదీ - 04-05-2019
శీర్షిక - సంస్కృతి సాంప్రదాయాల చుక్కాని
సంఖ్య - 177
మనిషి పాంచ భౌతికం...
మనసు అశ్వ వాహకం ...
ప్రకృతిలోని జీవరాశి నుండి
మనని మనంగా వేరయి
చక్కని మార్గములో
పెంపొందింపచేసుకోడానికి
చుక్కాని లాంటి జ్ఞాన
భాండాగారాలు
మన పౌరాణికాలు ......
ఆస్తికులైనా నాస్తికులైనా
ప్రపంచంలోని
మతమేదైనా మనిషయితే చాలు
పౌరాణికాలే మనిషికి ప్రాణవాయువు...
ఈ రంగుల ప్రపంచంలో
ముసుగు నీడను మోస్తున్న
మాయ మనసును విడిచి
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతకాలంటే
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతకాలంటే
ఓ దివిటీ కావాల్సిందే ....
వేదాలు,ఉపనిషత్తులు,
పురాణాలు, రామాయణ ,
మహాభారత భాగవతాలు
ఆది గాగల అనేక పౌరాణికాల
సారాంశ ప్రతిబింబాలే
మన సంస్కృతి,సంప్రదాయాలు
యుగాలు మారినా
తండ్రి మాటకు కట్టుబడి,
ఒకే మాట,ఒకే పత్ని అన్న
నానుడికి ప్రతీక ... రామాయణం.
వారసత్వం వరుస కాదు
ప్రతిభే ప్రధానమంటూ
రాజకీయాల నిర్వచనం
రాజసంగా తెలిపింది ... మహాభారతం.
నగునూరి రాజన్న
కరీంనగర్ (ప్రస్తుతం :రిచ్మండ్ )
No comments:
Post a Comment