Sunday, February 23, 2020

వనదేవతలు 2020

నగునూరి రాజన్న
వనదేవతలు 
తేది- 06-02-2020
శీర్షిక - జన స్మరణ చిరంజీవులు....
సంఖ్య - 355

ఏడు విడిచి ఏడు పండగా 
ఏద ఎదలు పొంగి పొర్లగా
ఊరువాడా కదిలి బైలెల్లెగా 
మేడారం జాతర జనుల సాక్షిగ .....
చెట్టు చేమ పుట్ట తేనెలాయె
దట్టమైన అడవే ఆధ్యాత్మికత కేంద్రమై  
ధరణిలోనే అతిపెద్ద జన జాతరగా  
జనమంతా చల్లగుండాలని కోరుతూ... 

సమ్మక్క సారక్కలు వనదేవతలాయె
పగిడిద్దరాజు గోవిందరాజులు దేవుళ్లుగా...
జంపన్న వాగులోన జనమంతా స్నానమాడ....
చెట్టు పుట్టలన్నీ వంట వార్పులతో కళకళలాడు... 

ఎత్తు బెల్లమే మొక్కు బంగారమాయే
బొట్టు బోనమే అమ్మకు నైవేద్యమాయె
శివసత్తుల భక్తి పూనకాలు చిందుగానాలు 
చచ్చినా బతికిన జన స్మరణ చిరంజీవులు....

కరువులు కాటకాలు పట్టని పాలకులకు
కప్పాలు కట్టమని తెగేసి చెప్పిన ధీరవనితలు 
నమ్ముకున్నోల్లకోసం ముందు నడచిన త్యాగమూర్తులు
కాలాలు మారినా కళ్ళల్లో నమ్మకాన్ని సడలించనీయని దేవతామూర్తులు....  


నగునూరి రాజన్న
కరీంనగరు

No comments:

Post a Comment