ఓ సునామీ మళ్ళీ రాకు సుమ -2108
ఇండోనేషియా లో కేంద్రీకృతమైన సునామీ
ఇరువైపులా విరుచుకబడి భీభత్సం సృష్టించి
ఇరువది ఆరు డిసెంబర్ 2004 అర్ధరాత్రి
భారత తూర్పు కోస్తా తీరమంతా విస్తరించావు
వేన వేల స్థిర చరాస్తుల నీలోనే కలుపుకున్నావ్
ఊళ్ళకు ఊళ్లనే ఊడ్చుకెళ్లావ్
తల్లి తండ్రులకు పిల్ల పాపలను
పిల్లపాపలకు తల్లి తండ్రులను దూరం చేసావు
గంగమ్మ తల్లంటే గంపెడు ఆశ
గట్ల గమనమే గురి మానవునికి
నాగరికత లో ఓనమాలు మొదలు నడకలు నేర్పినది
నవీన ప్రపంచం వైపు అడుగులు వేయించినిది
అతివృష్టి, అనావృష్టి ఈతి బాధలతో
అప్పుడప్పుడు పతనమౌతూనే ఉన్నాము
అరాచకాల అవినీతులలో సైతం
అతలాకుతలం అవుతూనే ఉన్నాం
గంగమ్మ తల్లంటే సల్లంగ సూత్తాదంటారు
ఓ సునామీ మళ్ళీ రాకు సుమా !
No comments:
Post a Comment