అక్షర జ్ఞానం - పుస్తక సంపద పరిణామం
ఇసుక మీద మొదలైన ఇంగింత జ్ఞానాన్ని
ఇనుమడించి అందించాడు నాటి మానవుడు
బండ మీది కెక్కించి పది కాలాలు
పదిలపరిచి పరిచయం చేసాడు నాగరికతను.
తమ అపార జ్ఞాన సంపదను ఋషులు
తాళ పత్ర గ్రంథాలుగా పొందు పరిచి
తదుపరి తరానికి అందించారు కానుకగా
తమ వంతు ఉపదేశముగా సందేశాలను .
అచ్చు యంత్రాల ఆవిష్కరణతో
అఖండమై నిలిచినది జ్ఞాన బాండాగారం
పుస్తకాలుగ పదిలమై వెలసినవి
పది కాలాలు నిలిచి, అమోఘమై, అపారమై అందినవి.
సాంకేతిక విప్లవంతో సమాచార నిక్షిప్తం సైతం
సంతరించుకున్నది కొత్త పుంతలు
గణన యంత్రాల సంతతిగా ,చిప్పు చిన్నదైనా
మెగా బైట్లుగా నిలిచి , ఒక్క క్లిక్కు తో
ఒలకబోస్తున్నది వేల పుస్తకాలను ఒక్కచోట.
No comments:
Post a Comment