Thursday, February 8, 2018

పతనమౌతున్న పంచ భూతములు


పంచ భూతములను పవిత్రముగా భావించి 
ప్రజలు  ఆనతో పూజించిరి భారతానా ఆనాడు 
నేల పట్టినా, నీరు వాడినా, అగ్ని ముట్టినా, 
వాయువు తాకినా, ఆకసం చూసినా. 

జాలారి నీళ్ళన్నీ నాలాలుగా పారించి 
జల కాలుష్యమంటూ జల్లు మంటున్నారు 
వాహనాలెన్నో అవసరానికి మించి వాడేసి 
వాయు కాలుష్యమంటూ వాపోవుచున్నారు. 

పాలిథీన్లతో, పంట రసాయనాలతో 
నేల కాలుష్యమంటూ నెత్తి నోరు మొత్తుకుంటున్నారు 
స్వార్థ చింతన కలిగిన సరంగు దళారులతో 
సర్వ సాపాటులు సైతం కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. 

పాప చింతన లేని కొంత అధికారులు, పాలకులు 
ప్రతీ పనిలో కాలుష్యము కనబరిచి 
ప్రజాస్వామ్యమును సైతము ఫణము పెట్టి 
పరిహాసాల పాలు చేయుచున్నారు.  

కాలుష్యం ఏకరువును కాకి గోలనుకోకు 
మంచి చెప్పే వారిని వంచనతో అవమానించకు 
పాటించే వారిని ప్రశంసించండి 
పాటు పడే వారికి చేయూతనివ్వండి .

మాటలు మాత్రమే చెబితే చాలదు 
మూటలు  వెచ్చిస్తే చాలదు సర్కారు 
ప్రతి పనిలో పైస దోస్తే చాలదు 
ప్రతీ వారు అనుక్షణం ఆత్మ సాక్షిగా ఆచరించాలి. 

పతనమౌతున్న పంచ భూతములను 
పాప (భవిత) భీతి కలిగి పదిలపరుచుకోవాలి 
కాదు కూడదంటే కాగలదు హాని,
ప్రశార్ధకమౌను మానవాళి ఉనికి. 

అన్ని కాలుష్యాలతో అరిష్టము దాపురించె 
అతి నీల లోహిత కిరణ నిరోధక వలయానికి  (OZONE)
అర్థిస్తే ఆగదు, ఆర్దరేస్తే తప్ప విశ్వ దేశములన్నీ వినమ్రముగా.  

No comments:

Post a Comment