స్వాతంత్రం వచ్చెనని సభలే చేసి
సంబర పడగానే సరిపోదోయని
సవినయముగా సెలవిచ్చాడో మహా కవి ఆనాడే
సదా మనమంతా మననం చేసుకుని మసలుకోవాలి ప్రతీ రోజు
అక్షరాస్యతను అభివృద్ధి పరచి
అధిక శాతం ఉద్యోగ కల్పనకు
అంకురమేర్పరచి నపుడే కదా
ప్రజా జీవన ప్రమాణం పరిణతి చెంది బంగారు తెలంగాణా ఏర్పడేది .
పౌరులందరూ క్రమ శిక్షణా అవగాహనలతో ,
పల్లెలన్నీ సస్య శ్యామలాల పరిమళాలు నిండి
పట్టణాలలో ప్రజలంతా సుఖ శాంతులతో
ఫరిడవిల్లడమే నాంది కదా బంగారు తెలంగాణా కు
ప్రతీ వారు నీతి నియమమాలు పాటిస్తూ
పాతరేసి లంచగొండి తనాన్ని తరిమి కొట్టినప్పుడు
పరస్పర అవసరాలను చిత్తశుద్దితో తీర్చుకో గలిగినప్పుడే
పాదుకోల్పును కదా మన బంగారు తెలంగాణా
ప్రభుత్వమంటే పన్నులోక్కటే కాదు మిత్రమా
ప్రభుత్వమంటే రాయితీలు, సంక్షేమాలే కాదు సోదరా
ప్రభుత్వమంటే ప్రజా పాలన మాత్రమే కాదు నాయనా
ప్రజా అవసరాలను ముందే పసికట్టి, అంచనాలు వేసి
పకడ్బందీ ప్రణాలికలు రచించీ , అమలు పరిచి
ప్రతి ఫలాలు ప్రజలకందేలా సేవ చేయడమేకదా మన బంగారు తెలంగాణా
ప్రముఖంగా ప్రభుత్వ ఆదాయ శాఖ,
ప్రజా ఆస్తుల నమోదుల శాఖ , వాహనాల నమోదుల శాఖ
ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ ఆరోగ్యా లయాలు
ప్రభుత్వ రక్షణ శాఖ పరిణతితో పని చేసినప్పుడే కదా మనకు బంగారు తెలంగాణా
అణగారిన రైతు కుటుంబాలలో
అక్షరాస్యతను అభివృద్ది పరచి
ఆధునిక వ్యవసాయం పై అవగాహన కల్పించి
ఆదుకున్నప్పుడే కదా మనకు అసలైన బంగారు తెలంగాణా
ఆడ మగ తేడా లేకుండా,కులమతాలకతీతంగా
కె జి నుండి పి జి వరకు ఉచిత విద్యనందించ గలిగి
స్వయంకృషి, ఆత్మ స్థైర్యము పెంపొందింప చేసి
రాష్ట్రం తద్వారా దేశ పురోగతిలో భాగస్వామ్యం కాగలిగినప్పుడే
కదా మనకు బంగారు తెలంగాణ
అంతే కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా
అదనుకు సరిపోయే విధంగా సచివులు , అధికారులు
సదా సమీక్షించుకుంటూ మార్పులు చేసుకుంటూ ముందుకు సాగి
ప్రజా అవసరాలను తీర్చ గలిగితే అదే కదా మన బంగారు తెలంగాణా
పల్లె పట్నం తేడా లేకుండా
పరిశుభ్రమైన నీటితో, పర్యావరణం పరిరక్షిస్తూ
పరిసరాల శుభ్రతలను పాటింప జేస్తూ
ప్రశస్తమైన జీవితాలను అందించడమే కదా బంగారు తెలంగాణా
ఒకటి కాదు రెండు కాదు ప్రతి పనిలో నాణ్యత కలిగి
ఒద్దికైన నమ్రతలతో పొరుగు రాష్ట్రాలతోనే కాకుండా
కేంద్రములో సైతం బిందువై ప్రతీ వారికి ఉదాహరణగా
ఫరిడవిల్లి పది కాలాలు నిలువడమే కదా బంగారు తెలంగాణా
No comments:
Post a Comment