Saturday, July 9, 2016

600 ఏండ్లు పరాయి పాలన - మన తెలంగాణా

శాత వాహనులు,విష్ణు కుండినులు - చాళుక్యులు, పల్లవులు, 
రాష్ట్ర కూటులు , కాకతీయులు -  నవాబులు ఏలిన రాజ్యం 
అతి పురాతనం, అతి  ప్రాచీనం   - అద్భుతం ఈ  చరితం 
అలరారినది 16 జిల్లాలతో-   600 పరగణాలలో ఆనాడే శ్రీమంతముతో

వింధ్య శ్రేణుల  దిగువ మొదలుకుని-విశ్వమెరిగిన దక్కను గా  సుపరిచితం 
వరుస చెరువులతో వ్యవసాయానికే వన్నె తెచ్చారు నాడు కాకతీయులు 
గొలుసు తటాకాల పుష్టి పెంచి - వరద నివారణలు గావించె నవాబులు 
అనాదిగా అక్షరాభ్యసంలో వెనుకబడినా-ఆదరించడములొ ఆద్యులం 

కొదమ సింహాల లాంటి  కొమురం భీమ్ , అయిలమ్మలు 
రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, దాశరథీ కృష్ణమా చార్యులు 
సర్వాయి పాపాన్న , మల్లు స్వరాజ్యం ,  కే వి  రంగా రెడ్డి సాటి లేని 
స్వా తంత్ర సమర యోధుల కన్న భూమి ఈ నేల 

పాలు మీగడల లాంటి జాలు వారే కవిత్వాలకు నెలవుగా 
పాల్కురికి సోమనాథుడు , బమ్మెర పోతన,భక్త రామదాసు ,సుద్దాల హన్మంతు,
వట్టికోట ఆళ్వారు స్వామి , దాశరథీ కృష్ణమా చార్యులు , కాళోజి,
పాముల పర్తి సదాశివ రావు ,పి. వి.నరసింహ రావు, సురవరం ప్రతాప్ రెడ్డి , అందెశ్రీ,

అంపశయ్య నవీన్, సినారె, గద్దర్, గొరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ , చంద్ర బోసు 
అరీఫుద్దిన్, అమ్జద్,  మఖ్దుమ్ మొహియుద్దీన్,మారన్న. వరవర రావు , మల్లినాథ సూరి , 
రసమయి బాలకృష్ణ - వజ్జల శివ కుమార్  ఆదిగా గల అందరు
కాకలు తీరిన ప్రముఖ భాషా పిపాసులు - కాలం మరువలేని  కవి బ్రహ్మలు 

ఆపద్ధర్మ ప్రధానిగా నిలిచినా - అపర చాణుక్యుడుగ అవతరించాడు 
ఆపద వాకిట తట్టిన ఆర్ధిక మాంద్యాన్ని అలవోకగా పారద్రోలి 
అపురూప కానుకగా ఇచ్చాడు - అచ్చెరువొందే ఆర్ధిక స్వావలంబనను 
కుటుంబ పాలన  కుటిల మెరుగడు -స్వార్దమెరుగని స్వర్ణ శీలి 
అనన్య సామాన్యుడు  పలు భాషా  ప్రవీణుడు మన పి. వి.నరసింహ రావు 

ఆరి తేరిన ప్రముఖ మిమిక్రీ పితామహుడు విశ్వ మెరిగిన  నేరెళ్ళ వేణు మాధవ్ 
వెండి తెరపై  వెలుగులీనిన సరిగమల  సరాగాల సార్వ భౌముడు  చక్రీ  
జ్ఞానపీర్  అవార్డ్ గ్రహీత మనదరికి మకుటాయమానం మన సినారె 
తెలిసిన వారు కొందరైతే - తెలియని వారు ఎందరో - మహానుభావులందరకు వందనాలు 

అపర శిబి చక్రవర్తుల మరిపించగల త్యాగధనుల కన్న భూమి ఇది  
ఆచార్య వినోభా భావే అద్వర్యంలో జాతీయ భూదానోద్య మం మొదలైనది
కొదువలేదు ప్రతిభకు   ప్రతీ రంగములో - కాని ప్రాచుర్యం పొందలేదు  
ఎదురులేదు ఏ  రంగం లోనైనా - కాని ఎదుగలేదు మర్రి మానుల నీడన 

600 ఏండ్లు పరాయిల పాలనలో  అక్షరాభ్యాసం అందని మాట నిజం 
అయినా  అందరిని ఆదరించి అక్కున చేర్చుకున్నది వాస్తవం

కోహినూర్ వజ్రమే కాదు  కొల్లగొట్ట బడినాము అనేక విధాలుగా 

ఆర్ధిక మాంద్యాన్నినిలువరించి -అపురూప  ఆర్ధిక స్వావలంబనను 

69 లో వచ్చిన ఉద్యమం  ఆనాటి కపట నాయకులదైతే 
అంతర సర్దుబాటుతో అణచి వేయబడినది -అందుకేనిలువలేదు  చాన్నాళ్ళు 
పోను పోను పిల్లి పాలు కాకుండా కుక్క పాలు తాగి కుండ పలగ గొట్టినట్టు 
అధికారుల స్థాయి నుండి అతి చిన్న ఉద్యాగానికి సైతం అక్కడి వారే 

తిలా పాపం  తలా పిరికె డన్నట్టు -మాట వరుసకైనా
అనకూడని పెడ మాటలను-సచివుల సమ్మేళనములో సైతం
ముఖ్యమైన వారువల్లిస్తే ఇంకెందుకు రాజుకోదు  ఈ  బడబాగ్ని 
అందుకే ఈ సారి వచ్చిన ఉద్యమం అంటుకుంది దావానంలా 

రాష్ట్రాలుగా వేరు పడినా  సోదరులుగా కలిసుందాం మిత్రమా 


No comments:

Post a Comment