జాషువా గారి సమగ్ర సాహిత్యం
అంధకారములో అరవిరిసిన కమలము
అమ్మ భాషలో పురి విప్పెను గళము
అనన్యమైన అధ్బుత రచనలతో
అంబరాన్ని చుంబించాడు అర్ధ శత వత్సరములు
మసక చీకటి తాను అనుభవించి
మణి వెలుగులిచ్చెను దివ్య రేడులా
మాతృ భాషకు ఓ మైలు రాయిగా
మలిచినది జాషువాగారి కవితా యుగం
రవి గాంచని చోటు కవి గాంచునన్నట్టు
రమ్యమైన ప్రకృతి ప్రాణ కోటిలో
రచనా కోణమైనది గబ్బిలము సైతం
రచయితల నెందరినో రక్తి కట్టించి నిలిచింది
నాస్తికతను తాను నమ్మి సమర్ధించినా
వాస్తవాలను సవివరముగా ఆవిష్కరించారు
బూర్జువాలను కవిగా ఎదిరించినా
సున్నితముగానే సృషించారు
పదనిసలై పారినవి వారి కవితా పల్లవులు
పరమ శ్రేష్ఠునిగా అభినందించ బడ్డాడు
పద్మ పురస్కారం తానుగా వరించినది
పరమ పూజ్యుని చరితకు నేను సైతం
No comments:
Post a Comment